జడ్చర్ల టౌన్/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తుండడంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కిందని చెబుతున్నారు. జిల్లాలో ముదిరాజ్ల ఓటు బ్యాంకు గణనీయంగా ఉండడం కూడా ఇదే కులానికి చెందిన చంద్రశేఖర్కు కలిసొచ్చినట్లయింది.
ఎంపీపీగా తొలి అడుగులు
చిన్నచింత కుంట ఎంపీపీగా 1995కు ముందు చంద్రశేఖర్ వ్యవహరించారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న ఎర్ర సత్యం(ఎం.సత్యనారాయణ) 1995 ఆగస్టు 12 హత్యకు గురికాగా 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2009లో మరో రెండు సార్లు భారీ మెజార్టీతోనే ఎమెల్యేగా విజయం సాధించిన ఆయన.. 2014 మినహా అన్నిసార్లు ప్రత్యర్థికి గట్టి పోటి ఇచ్చారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఘనత చంద్రశేఖర్కు ఉంది.
పార్టీకి పూర్వవైభవం తెస్తా ..
అ«ధిష్టానం తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు మహబూబ్నగర్ జిల్లాలో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
మూడు పార్టీల అధ్యక్షులు జడ్చర్ల నుంచే..
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు మరియమ్మ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వారే. ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి సైతం జడ్చర్ల నియోజకవర్గానికే చెందిన చంద్రశేఖర్కే దక్కడం విశేషం. కాగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎం.చంద్రశేఖర్ నియామకం ఖరారు కావడంతో శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడీపీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరాటే శ్రీను, నాయకులు మనోహర్, పర్శవేది, మురళి, వాజిద్, ఆంజనేయులు, రాజు, అనీల్, కేశవులు, నరేంద్ర, సునీల్, జావెద్, కిషన్ పాల్గొన్నారు.
టీడీపీ జిల్లా సారథి చంద్రశేఖర్
Published Sat, Sep 23 2017 10:50 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement