హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు!

SMT pvt limited to invest in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రూ. 250 కోట్ల పెట్టుబడితో గుండె సంబంధిత స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు ఎస్‌ఎంటీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ముందుకొచ్చింది. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కులో ఈ మేరకు ప్లాంటును ఏర్పాటుచేయనున్నారు.

ఇందుకోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో 2200మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అందుబాటులో అత్యుత్తమ మౌలిక వసతులు ఉండటం వల్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నామని వారు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top