సప్తగిరికాలనీ(కరీంనగర్): నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సౌభ్రాతృత్వం, ఆనందం వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫీతర్(రంజాన్) పండుగను భక్తి శ్రద్ధలతో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొత్తబట్టలు ధరించి చింతకుంట, సాలేహ్నగర్ ఈద్గాల వద్దకు వాహనాలు, కాలినడకన పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ఆలకించారు. అల్లాహ్ సందేశాన్ని జీవితంలో ఆచరించే స్ఫూర్తిని అందించాలని ప్రార్థించారు. అటవీ కార్యాలయం ఎదురుగా, ఇతర ప్రాంతాల్లో ఉన్న సమాధులపై పూలు చల్లి తమ పూర్వీకులకు నివాళులు అర్పించారు. బంధువులు, స్నేహితులను ఆలింగనాలు చేసుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్లల్లో బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేసి మైత్రీ భావాన్ని చాటుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సీవీఆర్ఎన్ రోడ్డు నుంచి జగిత్యాల వెళ్లే దారిలో రాకపోకలను మళ్లించి, పోలీస్లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాలెహ్నగర్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్..
వివిధ పార్టీల రాజకీయ నాయకులు వివిధ ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాలెహ్నగర్లోని ఈద్గా వద్ద కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మతాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇస్తోందని, హిందుముస్లింలు కలిసి మెలిసి ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్పొరేటర్ ఎండీ.ఆరీఫ్, దళిత, ముస్లిం నాయకుడు చంద్రశేఖర్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన సీపీ..
సాలెహ్ నగర్ ఈద్గా వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగం, పీసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్రెడ్డి ముస్లింకు రోజా పూలు, చాక్లెట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చిన్నారులు, యువకులు సీపీతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఏసీపీ ఉషారాణితోపాటు పీసీ కమిటీ బాధ్యులు బుర్ర మధుసూదన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఘన్శ్యామ్ పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు..
రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని పలు ఈద్గాల వద్ద పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను నియంత్రించారు. సాలెహ్నగర్ వద్ద బందోబస్తును సీపీ కమలాసన్రెడ్డి, ఏసిపీ ఉషారాణి పర్యవేక్షించారు.
నగరంలోని ఈద్గాల వద్ద
సాలెహ్నగర్లో జరిగిన ప్రార్థనలో ముస్లిం మత పెద్ద ముఫ్తీ గయాస్ ముషియొద్దీన్ ప్రసంగం చేశారు. దానధర్మాల ద్వారానే పుణ్యాన్ని సంపాదించుకోవాలని సూచించారు. పురానీ ఈద్గా, చింతకుంట ఈద్గా వద్ద ముప్తీ ఎత్తె మాదుల్ హాక్ నమాజ్తోపాటు ప్రసంగం చేశారు. బైపాస్రోడ్డులోని ఈద్గా అహ్మద్ వద్ద మౌలానా మహ్మద్ యూనుస్, నమాజ్ చేయించారు. అనంతరం ప్రసంగం చేశారు.
వెల్లివిరిసిన మత సామరస్యం...
నమాజ్ అనంతరం ముస్లింలు హిందువులను కూడా తమ ఇళ్లకు విందులకు ఆహ్వానించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి విందు ఆరగించారు. విదేశాలలోని బంధువులు, మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా రంజాన్
Published Thu, Jun 6 2019 8:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement