ఆటో బోల్తా : ఒకరు మృతి | One dies as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఒకరు మృతి

Sep 25 2015 4:53 PM | Updated on Sep 3 2017 9:58 AM

ఇటిక్యాల మండలం వేముల శివారులో శుక్రవారం అదుపు తప్పి ఓ ఆటో బోల్తాపడింది.

మహబూబ్‌నగర్ (ఇటిక్యాల) : ఇటిక్యాల మండలం వేముల శివారులో శుక్రవారం అదుపు తప్పి ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రవీణ్‌ కుమార్(38) అనే వ్యక్తి మరణించగా.. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. డిండి ప్రాజెక్టులో వినాయకుడిని నిమజ్జనం చేసి ఆలంపూర్‌లోని జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకుని వస్తుండగా 44వ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement