జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య

Free Education For Journalists Children In Private Schools - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించే అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు(టీయూడబ్లూజే హెచ్‌143) జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మంగళవారం యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి వారి పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలన్నారు.

ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సురేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, స్టిఫెన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రహమత్, దుర్గెష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top