మహబూబ్నగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. ఇందుకుగాను నవంబర్లో జడ్చర్లలో పౌరసమాచార ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రీజియన్ డెరైక్టర్ పి.ఐ.కె.రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పౌరసమాచార ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని డెరైక్టర్ తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఆయూ దినాల్లో కాకుండా ఉత్సావాలు నిర్వహిద్దామని సూచించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తామన్నారు.
డెరైక్టర్ పీఐకెరెడ్డి మాట్లాడుతూ గతంలో వనపర్తి, గద్వాలలో ఈ తరహా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఉపాధి హామీ, ఐసీడీఎస్, సమాచార హక్కు చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్వచ్చభారత్, మెకిన్ ఇండియా, బేటీబచావ్, బేటీ పడాన్ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.
50 స్టాళ్లను ఏర్పాటు చేసి భారీ సమాచార ప్రదర్శనను నిర్వహించనున్నామన్నారు. అంతేకాక పలు అంశాలపై సదస్సులు, సమావేశాలు, గోష్టులు నిర్వహించనున్నామని, వీటితో పాటు కళాబృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి
Published Wed, Oct 22 2014 4:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement