ఎస్సారెస్పీ పునరుజ్జీవన పనులు ప్రారంభం | ASRSP renaissance works begin | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ పునరుజ్జీవన పనులు ప్రారంభం

Aug 14 2017 1:32 AM | Updated on Oct 30 2018 7:50 PM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవన పథకం పనులు ప్రారంభమయ్యాయి.

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవన పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేసిన రెండు రోజులకే పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీని నింపడమే పునరుజ్జీవన పథకం ప్రధాన ఉద్దేశం. వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 100 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న మూడో పంపు నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి.

వరద కాలువ 102 కిలోమీటర్‌ నుంచి 73 కిలోమీటర్‌ వద్ద ఒక పంపు, 34 కిలో మీటర్‌ వద్ద రెండో పంపు, 100 మీటర్ల దూరంలో మూడో పంపు నిర్మాణం చేపట్టేలా డిజైన్‌ చేశారు. మూడో పంపు నిర్మాణ పనులు ముప్కాల్‌ మండల కేంద్ర శివారులో కొనసాగుతున్నాయి. ఒక్కో పంపు హౌస్‌ వద్ద 8 పంపులు నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement