నల్లగొండ జిల్లాలో మరో చిట్టీల మోసం బయటపడింది.
రూ. 6 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ
Jan 12 2016 12:14 PM | Updated on Aug 29 2018 4:18 PM
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరో చిట్టీల మోసం బయటపడింది. స్థానిక ప్రకాశం బజార్ లో ఉండే పోతరాజు నరసింహ చిట్టీల పేరుతో ఖాతాదారులను నిలువునా ముంచాడు. సాయి చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసిన నరసింహ భారీగా నగదును వసూలు చేశాడు. దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసిన నిందితుడు వాటితో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న భాదితులు ఆందోళన చేశారు. ఈ మోసం పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement