బావిలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం | 2 young man killed in adilabad district | Sakshi
Sakshi News home page

బావిలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం

May 30 2016 3:47 PM | Updated on Aug 1 2018 2:29 PM

ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తూ బావిలోపడి ఇద్దరు యువకులు మృతిచెందారు.

కడెం: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తూ బావిలోపడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన కడెం మండలం గుడితిర్యాల గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెరికి గ్రామానికి చెందిన నరేష్(24), చింటు(20) అనే యువకులు దైవదర్శనార్థం గుడితిర్యాలకు వచ్చారు. పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లిన నరేష్ నీటిలో మునిగిపోతుండగా గట్టుపై ఉన్న చింటూ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతి దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement