కొణతాల రామకృష్ణ భార్య మృతికి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ సంతాపాన్ని తెలిపారు.
కొణతాలకు వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పరామర్శ
Sep 27 2016 11:54 AM | Updated on Jul 25 2018 4:09 PM
హైదరాబాద్: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కొణతాల రామకృష్ణకు మంగళవారం ఫోన్ చేసి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణతాల రామకృష్ణ భార్య సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement