డీసీఎం, క్రూజర్ వాహనం ఢీ..ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం, క్రూజర్ వాహనం ఢీ..ఇద్దరి మృతి

Sep 22 2016 1:47 PM | Updated on Oct 8 2018 5:07 PM

కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

ఆమనగల్లు మండలం కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై డీసీఎం, క్రూజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన గొల్ల చంద్రయ్య(45), సాలమ్మ(55)లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement