డీసీఎం, క్రూజర్ వాహనం ఢీ..ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం, క్రూజర్ వాహనం ఢీ..ఇద్దరి మృతి

Sep 22 2016 1:47 PM | Updated on Oct 8 2018 5:07 PM

కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

ఆమనగల్లు మండలం కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై డీసీఎం, క్రూజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన గొల్ల చంద్రయ్య(45), సాలమ్మ(55)లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement