భక్త రామదాసు ప్రాజెక్టులో భారీ ప్రమాదం సంభవించింది.
భక్తరామదాసు ప్రాజెక్టులో భారీ ప్రమాదం
Mar 28 2017 12:32 PM | Updated on Sep 5 2017 7:20 AM
పాలేరు: భక్త రామదాసు ప్రాజెక్టులో భారీ ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం తలెత్తటంతో సంప్ హౌస్ లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో మోటార్లు మునిగిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. స్పందించిన అధికారులు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నీరు రాకుండా అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టుగా ఈ ఎత్తిపోతల రికార్డు సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని జనవరి 31వ తేదీన ప్రారంభించారు.
Advertisement


