భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు.
భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు
Sep 10 2016 8:14 PM | Updated on Sep 4 2017 12:58 PM
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు.
Advertisement
Advertisement