వ్యక్తిగత పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం వన్మం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జై కృష్ణ. తాజాగా ఆర్య, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న పొరంబోకు, నకుల్, దినేష్ నటిస్తున్న తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తువుం, విష్ణు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న ఇడం పొరుళ్ ఎవల్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ వరుసలో వస్తున్న మరో చిత్రం వన్మం. విజయ్ సేతుపతి, కృష్ణలు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో సునైనా, హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర దర్శకుడు జైకృష్ణతో చిట్చాట్.
చిత్ర టైటిల్ గురించి కాస్త వివరిస్తారా?
వన్మం అంటే ప్రతీకారేచ్ఛ అని అర్థం. ఒక వ్యక్తి పగ, ప్రతీకారాలే చిత్ర కథ. పగ అనేది ప్రతి వ్యక్తిలోను ఏదో ఒక మూల దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. పోతుంది. అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రమే వన్మం. అయితే అది మాత్రమే చిత్ర కథ కాదు.
ఇంకా ఎలాంటి విషయాలుంటాయి?
మాటలు గొంతు దాటనంత వరకే మర్యాద ఉంటుంది. వాటిని బయటకు అనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి కోపంలోనైనా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కమాట తూలినా సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. దేశంలో పలు సమస్యలు ఇలాంటి వ్యాఖ్యల వలనే తలెత్తుతున్నాయి. అలాంటి ఒక వ్యాఖ్య చిత్రంలోని పాత్రల్ని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లిందన్నది వన్మం చిత్రం.
చిత్రంలో విజయ్సేతుపతి, కృష్ణలు స్నేహితులా?
చిత్రంలోనే కాదు నిజ జీవితంలోనూ స్నేహితులే. ఈ చిత్రానికి వారిద్దరి సహకారం అపారం. ఉద్యోగవేటలో ఉండే కృష్ణ, ఆజన్మ ధనవంతుడైన విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు.
నటి సునైన ఎవరికి జంటగా నటిస్తున్నారు?
ప్రస్తుతానికి ఆ ఒక్కటి అడగకండి. చిత్రం చూసి సునైన ఎవరికి జోడి అన్నది తెలుసుకోండి.
సునైన చాలా గ్లామరస్గా నటించారట?
అలాంటిదేమి లేదు. కాకపోతే కొలనులో స్నానమాడే సన్నివేశం చిత్రంలో చోటు చేసుకుంటుంది. అది అంత గ్లామరస్గా ఉండదు. అయితే చిత్ర కథకు ఏమేమి అవసరమో అన్నీ వుంటాయి.
చిత్ర షూటింగ్ మొత్తం నాగర్కోవిల్లోనే నిర్వహించారట?
అవును. నా సొంత ఊరు నాగర్కోవిల్. కథకు ఆ ప్రాంతాన్నే నేపథ్యంగా ఎంచుకున్నాను. నిర్మాత జెపక్కు కథ చెప్పగానే బాగుందన్నారు. ఇప్పటి వరకు తెరపై చూడని లొకేషన్స్, నాగర్కోవిల్లో వున్నాయి. దీంతో షూటింగ్ మొత్తం నాగర్కోవిల్, కన్యాకుమారి ప్రాంతాల్లో పూర్తి చేశాం.
పగ, ప్రతీకారాల వన్మం
Published Sun, Oct 19 2014 12:08 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
Advertisement