'మాటలు ఆపి ఆటపై దృష్టిపెట్టండి' | Stop talking and focus on playing good cricket: Gavaskar | Sakshi
Sakshi News home page

'మాటలు ఆపి ఆటపై దృష్టిపెట్టండి'

Aug 15 2015 8:36 PM | Updated on Sep 3 2017 7:30 AM

టీమిండియా మేనేజ్మెంట్ మాటలు ఆపి, ఆటపై దృష్టిసారించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు.

న్యూఢిల్లీ: టీమిండియా మేనేజ్మెంట్ మాటలు ఆపి, ఆటపై దృష్టిసారించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘోరపరాజయం అనంతరం గవాస్కర్ పైవిధంగా స్పందించారు.

దూకుడు స్వభావం మాటలు, తాత్కాలిక చర్చలు ఆపి మెరుగైన ఆట ఆడటంపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమనైందని గవాస్కర్ అన్నారు. శ్రీలంకతో గాలె టెస్టులో నాలుగోరోజు 176 పరుగుల లక్ష్యసాధనలో భారత్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా లంకతో మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా గాడిలో పడుతుందని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement