►కొరియా ఓపెన్ సెమీస్లోకి భారత స్టార్
►క్వార్టర్స్లో మితానిపై గెలుపు
►నేడు చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోరు
►సెమీఫైనల్స్ ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
సియోల్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–19, 16–21, 21–10తో ప్రపంచ 19వ ర్యాంకర్ మినత్సు మితాని (జపాన్)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించిన మినత్సు అదే జోరును సింధుపై కనబర్చలేకపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధుకు తొలి గేమ్లో గట్టిపోటీనే లభించింది. రెండో గేమ్లో తడబడిన ఈ తెలుగు తేజం నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం చెలరేగిపోయింది. ఆరంభంలోనే వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచిన సింధు 9–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించిన సింధు గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది.
శనివారం జరిగే సెమీఫైనల్లో ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–5తో వెనుకబడి ఉంది. మరో సెమీఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్)తో అకానె యామగుచి (జపాన్) ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 22–20, 10–21, 13–21తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సమీర్ తొలి గేమ్ను గెలిచినా... ఆ తర్వాత డీలా పడ్డాడు. ఈ గెలుపుతో ఈ ఏడాది ఇండియా ఓపెన్లో సమీర్ వర్మ చేతిలో ఎదురైన పరాజయానికి సన్ వాన్ హో బదులు తీర్చుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 14–21, 21–17, 21–15తో మూడో సీడ్ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.
సింధు జోరు...
Published Sat, Sep 16 2017 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement