
హార్ట్స్, స్టార్స్ ఫుట్బాల్ మ్యాచ్ ‘డ్రా’
క్రికెటర్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ‘ఆల్ హార్ట్స్’... బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సారథ్యంలోని ఆల్ స్టార్స్’ జట్ల మధ్య.....
ఆకట్టుకున్న బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు
ముంబై: క్రికెటర్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ‘ఆల్ హార్ట్స్’... బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సారథ్యంలోని ‘ఆల్ స్టార్స్’ జట్ల మధ్య శనివారం జరిగిన చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ 2-2తో ‘డ్రా’ అయ్యింది. హార్ట్స్ జట్టులో యువరాజ్, కేఎల్ రాహుల్ గోల్స్ చేయగా.... సుజిత్, రణబీర్ కపూర్లు స్టార్స్ టీమ్కు గోల్స్ అందించారు.
విరాట్ ఫౌండేషన్... అభిషేక్కు చెందిన ‘ప్లేయింగ్ ఫర్ హ్యుమానిటీ’ సంస్థలు ఈ మ్యాచ్ను ఏర్పాటు చేశాయి. భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని కూడా ఈ మ్యాచ్లో పాల్గొన్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్లో అభిషేక్ బచ్చన్ బరిలోకి దిగలేదు. తొలి అర్ధభాగానికి ఆల్ స్టార్స్ 2-1 ఆధిక్యంలో నిలిచినా.. మ్యాచ్ పది నిమిషాల్లో ముగుస్తుందనగా రాహుల్ కొట్టిన గోల్తో స్కోరు సమమైంది.