తొలిరౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి

Published Thu, Nov 2 2017 10:48 AM

Bopanna pair Knocked out from paris open - Sakshi

పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. పారిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 2–6, 6–7 (7/9)తో యువాన్‌ సెబాస్టియన్‌ కాబల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న–క్యువాస్‌ జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తమ సర్వీస్‌ను మాత్రం రెండుసార్లు కోల్పోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement