క్వార్టర్స్‌లో సాకేత్ జంట | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్ జంట

Published Thu, Jul 30 2015 12:31 AM

క్వార్టర్స్‌లో సాకేత్ జంట

లెక్సింగ్టన్ (అమెరికా): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డేవిస్‌కప్ జట్టు ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన భాగస్వామి దిమితార్ కుత్రోవ్‌స్కీ (బల్గేరియా)తో కలిసి సాకేత్ తొలి రౌండ్‌లో 7-5, 5-7, 10-7తో టాప్ సీడ్ జోడీ అలెక్స్ బోల్ట్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా)ను బోల్తా కొట్టించాడు.
 
   పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఏడో సీడ్ లియామ్ బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 2-6, 1-6తో ఓడిపోయాడు.మరోవైపు అట్లాంటా ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. జారెడ్ డొనాల్డ్‌సన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 1-6, 6-3, 4-6తో ఓడిపోయాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement