ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి : కేసీఆర్‌ | Telangana CM KCR Lays stone for Yadav Bhavans at Kokapet | Sakshi
Sakshi News home page

బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్‌

Dec 29 2017 7:55 PM | Updated on Aug 15 2018 9:40 PM

Telangana CM KCR Lays stone for Yadav Bhavans at Kokapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..గొల్ల, కురుమ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వీటితో వేల కోట్ల సంపదను యాదవలు సృష్టించబోతున్నారన‍్నారు. పశువుల కోసం మొబైల్‌ వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇక నుంచి తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని,  తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తామని సీఎం తెలిపారు. అదే పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్‌ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement