'అంతా తమరే చేస్తున్నట్లు బిల్డప్పులుండేవి'

Vijaya Sai Reddy Comments On Chandrababu In Twitter - Sakshi

సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ట్విటర్‌ వేదికగా విమర్శానాస్ర్తాలు సంధించారు. ' బాబు ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా మాత్రమే బాగుపడింది. 2.5 లక్షల కోట్ల రుణాలు, 60 వేల కోట్ల కాంట్రాక్టర్ల బకాయిలు, 20 వేల కోట్ల కరెంటు అప్పు వదిలి వెళ్లాడు. పేద ప్రజలకు రూపాయి ఇవ్వడానికి మనసొప్పలేదు. గ్రాఫిక్స్ ను దాటి ఒక్క పని గ్రౌండ్ కాలేదంటూ' విరుచుకుపడ్డారు.
(హైదరాబాద్ రమ్మంటారా.. విజయవాడ వస్తారా?)

మరో ట్వీట్‌లో ' కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా బాబూ? అప్పట్లో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడాలు... దిశానిర్దేశాలుండేవి. అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవి. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు ఎల్లో మీడియా డప్పుకొట్టేదంటూ' పేర్కొన్నారు.
(ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top