ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు

More 45 Coronavirus Cases In Andhrapradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 45 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనాతో ఇవాళ  నెల్లూరు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 54కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
'అవమానం భరించలేకపోయాం.. అందుకే రాజీనామాలు'
భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top