నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు | Singapore PM Lee Hsien Loong on 5-day visit to India, will meet PM | Sakshi
Sakshi News home page

నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు

Oct 4 2016 3:21 AM | Updated on Aug 21 2018 9:33 PM

నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు - Sakshi

నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు

ఐదు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

న్యూఢిల్లీ: ఐదు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడే దిశగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపైనా చర్చించనున్నారు. మోదీ, లూంగ్‌ల సమక్షంలో భారత పారిశ్రామిక విధానాల, ప్రోత్సాహకాల శాఖతో సింగపూర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేంద్రం మంగళవారం ఢిల్లీలో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, దేశంలోని సింగపూర్‌వాసులతో, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో విడివిడిగా భేటీకానున్నారు. 5, 6వ తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లూంగ్ పర్యటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement