చిదంబరాన్ని కలిసిన రాహుల్‌, ప్రియాంక | Sakshi
Sakshi News home page

చిదంబరాన్ని కలిసిన రాహుల్‌, ప్రియాంక

Published Wed, Nov 27 2019 10:57 AM

Rahul Gandhi and Priyanka Vadra Met Chidambaram in Tihar Jail   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, మనీష్‌ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్‌ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు.      

Advertisement
Advertisement