ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి | Post matric scholarship scheme for SC students | Sakshi
Sakshi News home page

ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి

Jul 16 2018 4:55 AM | Updated on Oct 1 2018 5:41 PM

Post matric scholarship scheme for SC students - Sakshi

న్యూఢిల్లీ: పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్‌ ఖాతాలో ఫీజు డిపాజిట్‌ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. 

Advertisement
 
Advertisement
Advertisement