'ఆప్' విజయంపై కేసీఆర్ హర్షం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడం ద్వారా ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు చెప్పారన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారనడానికి ఈ తాజా ఢిల్లీ ఫలితాల్లే నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ప్రజలు అవినీతిరహిత, పారదర్శక పాలనలను కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు.


