మూడు నెలలుగా చైనా దేశీయుడి పర్యటన

China Tourist Rounding in karnataka For Three Months - Sakshi

కర్ణాటక,మైసూరు : చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా కారవ్యాన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం కలకలం రేపుతోంది. బ్యాట్రిక్‌ అనే వ్యక్తి సొంత కారవ్యాన్‌లో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. దీంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్రిక్‌ కరోనా ప్రబలక ముందే తాను భారత్‌కు వచ్చానని అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరంలోకి ప్రవేశించకుండా కారవ్యాన్‌లో ఉంటున్నానని తెలిపాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top