నాలుగు మొండాలు స్వాధీనం.. | 4 Bodies Without Heads Found In A Ditch In Bihar's Begusarai District | Sakshi
Sakshi News home page

నాలుగు మొండాలు స్వాధీనం..

Sep 19 2016 2:56 PM | Updated on Sep 4 2017 2:08 PM

నాలుగు మొండాలు స్వాధీనం..

నాలుగు మొండాలు స్వాధీనం..

బీహార్ బెగుసరాయ్ జిల్లాలో తలలేని మొండాలు కనిపించడం కలకలం సృష్టించింది.

బెగూసరాయ్ః తలలేని నాలుగు మొండాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెగుసరాయ్ జిల్లా సన్హా  రైల్వే క్రాసింగ్ దగ్గరలోని ఓ మురిగి కాలువ వద్ద  మృత దేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

బీహార్ బెగుసరాయ్ జిల్లాలో తలలేని మొండాలు కనిపించడం కలకలం సృష్టించింది. కాలువవద్ద పశుగ్రాసం కోసేందుకు వెళ్ళిన ఓ మహిళకు ఆ ప్రాంతంలో పడుకోబెట్టి ఉన్న తల లేని మృత దేహాలు కనిపించడంతో ఆమె వెంటనే తమకు సమాచారం అందించినట్లు సాహెబ్పూర్ కమల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. మృతదేహాల్లో ఒక మహిళ, ఇద్దరు మైనర్ బాలికలు, ఓ బాలుడు ఉండగా.. బాడీలను పోస్ట్ మార్టమ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. పోలీసులు త్వరలో మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement