కొత్తగా ఖాతాలు తెరిచిన 30 కోట్ల కుటుంబాలు | 30 crore families got Jan Dhan accounts | Sakshi
Sakshi News home page

కొత్తగా ఖాతాలు తెరిచిన 30 కోట్ల కుటుంబాలు

Sep 13 2017 12:07 PM | Updated on Sep 19 2017 4:30 PM

జన్‌ధన్‌ యోజన స్కీమ్‌ విజయవంతం అయినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరంభించిన జన్‌ధన్‌ యోజన స్కీమ్‌  విజయవంతం అయినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ మూడేళ్లలో ఈ స్కీమ్‌ కింద 30 కోట్ల కుటుంబాలు కొత్తగా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాయని ఆయన బుధవారం ప్రకటించారు.

జన్‌ధన్‌యోజన కార్యక్రమం ఆరంభించకముందు.. దేశంలో దాదాపు 42 శాతం కుటుంబాలు బ్యాంకింగ్‌ రంగానికి దూరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 99.99 శాతం కుటుంబాలు ఒదోఒక బ్యాంక్‌ అకౌంట్‌ను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement