గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం | 12 feared dead in factory fire in Ghaziabad | Sakshi
Sakshi News home page

గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Nov 11 2016 9:24 AM | Updated on Sep 5 2018 9:47 PM

ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని సహిబాబాద్ లో గల ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పన్నెండుమంది మృత్యువాత పడ్డారు.

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని సాహిబాబాద్ లో గల ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పన్నెండుమంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. చాలామంది ఈ సమయంలో నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన వెంటనే మొత్తం 14 అగ్ని మాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు నివారించేందుకు చర్యలు ప్రారంభించాయి. అత్యవసర సహాయ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గలకారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement