
విజయ్ దేవరకొండ కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి పట్టుతప్పి..
వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఇటీవల లడక్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్తో మంచి హిట్ పెయిర్ అనిపించుకున్న రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు.
కాకినాడలో షూటింగ్లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్ పట్టుతప్పి కిందపడిపోబోయారు. అనంతరం తిరిగి పట్టుచిక్కి ట్రైన్ ఎక్కారు. ఈ ఘటనలో విజయ్కి చిన్న గాయమే అయినా, ఒకవేళ పట్టుతప్పి పడిపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ జరుగుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, షూటింగ్లో గాయపడిన విజయ్ జీవితంలో ఏదీ ఊరికే రాదు.. గాయాలతో కూడా పండగ చేసుకోవాలి అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఫొటో పెట్టారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా, టాక్సీవాలా చిత్రాల హిట్లతో టాలీవుడ్లో టాప్ స్టార్ల లిస్టులో చేరిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది గూగుల్లో నెటిజన్లు వెతికిన సౌత్ ఇండియా టాప్ ట్రెండింగ్ స్టార్ల జాబితా 'టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీ స్టార్స్ 2018' విభాగంలో విజయ్ దేవరకొండ నాలుగో స్థానంలో నిలిచారు.