అయ్యప్ప కటాక్షంతో... | Sakshi
Sakshi News home page

అయ్యప్ప కటాక్షంతో...

Published Thu, Dec 12 2019 12:22 AM

rudhrabhatla venugopal speech at veera sastha ayyappa kataksham - Sakshi

సుమన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్‌ హరీంద్ర, అశోక్‌ కుమార్‌ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్‌ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్‌ కెరీర్‌లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్‌.పి. తెన్నేటి, టి.ఎస్‌. బద్రీష్‌ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు.

అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్‌ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్‌. పి. తెన్నేటి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement