భారత హైకమినర్కు పాక్ సమన్లు | Indian High Commissioner Gautam Bambawale summoned by Pakistan Foreign Office | Sakshi
Sakshi News home page

భారత హైకమినర్కు పాక్ సమన్లు

Sep 29 2016 8:05 PM | Updated on Sep 4 2017 3:31 PM

ఇండియన్ ఆర్మీ సర్జికల్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయానికి సమన్లు పంపించింది.

కరాచీ: ఇండియన్ ఆర్మీ సర్జికల్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయానికి సమన్లు పంపించింది. దాడిని ఖండిస్తూ ఇండియన్ హైకమిషనర్ గౌతం బాంబ్వాలేకు నోటీసులు పంపించింది.

సర్జికల్ స్ట్రైక్స్ పై వివరణ ఇవ్వాలని, దాడులను ఎలా సమర్థిస్తారో చెప్పాలంటూ పాక్ అందులో ప్రశ్నించినట్లు సమాచారం. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కూడా ఇక్కడి పాక్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో పాక్ సమన్లు పంపించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement