నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు.
రౌడీషీటర్ దారుణ హత్య
Mar 4 2016 12:21 PM | Updated on Jul 30 2018 8:29 PM
హైదరాబాద్: నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రశాంత్నగర్ లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జనార్థన్ ను గుర్తుతెలియని దుండగులు అతన్ని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. జనార్థన్ పై రౌడీషీట్ ఉంది.
Advertisement
Advertisement