మానవహక్కుల కమిషన్కు టీపీసీసీ మహిళా నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల వరుస మరణాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్కు టీపీసీసీ మహిళా నేతలు గురువారం విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఇందిరాశోభన్ తదితరులు మానవహక్కుల కమిషన్ను కలిశారు. అనంతరం అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే బాలింతలు వరుసగా మృత్యువాత పడటం ఆందోళ నకరమన్నారు.
ఆస్పత్రుల్లో సదుపాయాలు లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం వల్లనే బాలింతలు చనిపోయారని అన్నారు. ఆస్పత్రులను సందర్శించడానికి ప్రత్యేక కమిటీని వేయాలని మానవహక్కుల కమిషన్ను కోరినట్లుగా వెల్లడిం చారు. చనిపోయిన బాలింతల కుటుంబా లకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టుగా డీకే వెల్లడించారు. ఆస్పత్రులపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలకోసం ప్రభుత్వం టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీభవన్ నుంచి మానవ హక్కుల కమిషన్ కార్యాల యం దాకా మహిళానేతలు ర్యాలీగా వెళ్లారు.
కేసీఆర్ జిందాబాద్ నినాదాలు
అయితే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సందర్భంగా మహిళా కార్యకర్తలు తడబడి, సీఎం కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. దీనిని గుర్తించిన మహిళానేతలు వెంటనే సవరించి, కార్యకర్తలకు సూచనలు చేశారు.
ప్రసూతి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
Published Fri, Apr 28 2017 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement