చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
హైదరాబాద్: చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగింది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది.
సాయంత్రం ఐదు గంటలవరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటింగ్లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు 42.56 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సాయంత్రం 6.30 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.