సాక్షి,సిటీబ్యూరో: గోదావరి జలాలు సిటీలో గలగలా పారించేందుకు జలమండలి అధికారులు కొత్త రూట్ సిద్ధం చేస్తున్నారు. జలమండలి ప్రాజెక్టు సమీక్షలో సీఎం చేసిన సూచనల ఆధారంగా కసరత్తు ప్రారంభించారు. కొత్త రూట్లో పైప్లైన్ల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందించేపనిలో పడ్డారు. విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ)ద్వారానే రాజధాని నగరానికి నీటిని తరలించవచ్చు. పైపులైను మార్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీరనుంది.
వాటర్గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకానికి కూడా సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ఇటీవల జలమండలి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ఈ పథకానికి కొత్త మార్గాన్ని సూచించారు. కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాలతో జలమండలి అధికారులు ప్రతిపాదనులు రూపొందిస్తున్నారు.
కొత్త మార్గం ఇలా..
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్పేట్ వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో 186 కి.మీ మార్గంలో గోదావరి మంచినీటి పథకం పైప్లైన్ పనులను 2008లో ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం మొదటి దశ ద్వారా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. పాత మార్గం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి-బొమ్మకల్-మల్లారం నీటిశుద్ధికేంద్రం-కొండపాక-ఘన్పూర్-శామీర్పేట్(నగర శివారు) మార్గంలో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సీఎం సూచనల ప్రకారం కొత్త మార్గంలో బొమ్మకల్రిజర్వాయర్ను మినహాయించి ఎల్లంపల్లి(126 మీటర్ల ఎత్తున్న కాంటూరు)నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం జగిత్యాల మార్గంలో ఎత్తై కొండ ప్రాంతం ఎండపల్లి(480మీటర్ల ఎత్తు)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ఆధారంగా 10 టీఎంసీల నీటిని మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి తరలించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో కొత్త మార్గం సాధ్యాసాధ్యాలపై జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గోదావరి పథకం తొలిదశను ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశంచడంతో గోదావరి పథకం రెండోదశలో భాగంగా ఈ కొత్త మార్గం గుండా నీటిని తరలించాలా ? లేదా తొలిదశలోనే ఈ మార్గం గుండా నగరానికి నీటిని తరలించాలా ? అన్న అంశంపై అధికారులు పరిశీలనచేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తరవాత కొత్త మార్గంపై సీఎంకు నివేదిస్తామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం తాము క్షేత్రస్థాయి పరిశీలన మాత్రమే జరుపుతున్నామని స్పష్టంచేశారు. నూతన మార్గంలో నేల వాలును తెలిపే కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసిన తరవాతనే కొత్త మార్గంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
తీరనున్న పలు గ్రామాల దాహార్తి..
సీఎం సూచనల ప్రకారం గోదావరి ప్రస్తుత మార్గాన్ని స్వల్పంగా మార్చిన పక్షంలో పైప్లైన్కు ఆనుకొని ఉన్న కరీంనగర్,మెదక్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల దాహార్తి తీరనుందని, అక్కడి జిల్లా గ్రిడ్లకు ఈ మార్గం దాహార్తిని తీర్చే వరదాయినిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త మార్గం గుండా పైప్లైన్లు వేస్తే నీటి పంపింగ్కు అయ్యే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.
గోదావరికి కొత్త రూట్..!
Published Mon, Jan 19 2015 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement