ఫరూఖ్నగర్ మండలం హజిపల్లి ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ షాద్నగర్ స్టార్స్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
Aug 4 2016 1:10 AM | Updated on Jul 26 2019 4:10 PM
హజిపల్లి(షాద్నగర్రూరల్): ఫరూఖ్నగర్ మండలం హజిపల్లి ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ షాద్నగర్ స్టార్స్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంఈఓ శంకర్రాథోడ్ చేతుల మీదుగా అందజేశారు. ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతస్థాయిలో రాణించాలని అన్నారు. లయన్స్క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారంశ్రీనివాస్, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు రంగయ్య, నాగరాజ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement


