సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్ల వల్ల పోలీసు శాఖకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరనగర్లలో, పోలీసు స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్స్కు సిగ్నల్స్ అందడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు
Published Tue, Jul 26 2016 8:48 PM
# Tag
Related news
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు -
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..ముగిసిన భవానీ దీక్ష విరమణ (ఫొటోలు)
-
కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక
ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి. బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్లు.... నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్–1 ఫ్లైఓవర్ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ► రెండోఫ్లైఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు. ► దీంతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు పనులకు అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్లో ఉన్న 860మీటర్ల సర్వీస్రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ► బెంజి సర్కిల్నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులకు మార్గం సుగమం అవుతోంది. ► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్ ఫ్లైఓవర్ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు. ► గ్రీన్ ఫీల్డ్ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. బైపాస్లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్ బైపాస్ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది. ► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. ముంపు నుంచి ఉపశమనం నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్ ట్రాక్తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. అందాల వాడగా తీర్చిదిద్దాం బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్ను సుందరీకరించాం, ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించాం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. – ఎస్.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్యూఆర్ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించారు. అజిత్సింగ్ నగర్ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్ నగర్ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు. టీడీపీలో గ్రాఫిక్స్తోనే సరి... టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు. సరికొత్తగా ఇంద్రకీలాద్రి ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విహారం కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ సంస్థ చర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం దుర్గఘాట్నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్గేమ్స్, ఎడ్వంచర్ గేమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... రెండు యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు : రూ.22 కోట్లు ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు రూఫ్ టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు -
Bhavani Deeksha Viramana Images: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ రద్దీ (ఫొటోలు)
Related News by category
-
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్, ఆలా మహేష్, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్ మదరసా (షఫి), షేక్ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ విభాగం కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్, కొరగంటి ఉదయ్రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్కుమార్, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్కుమార్, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్, టి.నరసింహారావు, ఎస్.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్, కె.విజయ్, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్బాబు, మురికిపూడి రమేష్, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షురాలిగా వెంకటరమణి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. -
అట్టహాసంగా మేకతోటి సుచరిత నామినేషన్
తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ఘట్టం కొనసాగింది. గుంటూరు నవభారత్నగర్ 4వ లైను నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడికొండ చేరడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నవభారత్ నగర్, విద్యానగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు మీదుగా లాడ్జి సెంటర్ వద్దకు చేరుకొని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామా బిల్డింగ్, నగరాలు, గోరంట్ల, లాం సెంటర్కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాం గ్రామస్తులు క్రేన్తో సుచరితకు భారీ గజమాలను వేసి సత్కరించారు. అనంతరం వాహనాల ర్యాలీ నడుమ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగా అక్కడ మేడికొండూరు మండలానికి చెందిన కొరివి అజయ్ ఏర్పాటు చేసిన భారీ గజమాలతో స్వాగతం పలకగా కార్యకర్తలు నాయకులు కదం తొక్కారు. అడ్డరోడ్డు కూడలి జనసంద్రంగా మారింది. డీజే బాక్సులు, పూల జల్లులతో అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె మేకతోటి రిషికతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొన్న మేకతోటి సుచరిత నామినేషన్ పత్రాలు ఆర్వో ఎం గంగరాజుకు అందజేశారు. నామినేషన్ ఘట్టానికి స్వచ్ఛందంగా 25 వేల మందికి పైగా హాజరయ్యారు. మండుటెండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యాకర్తలు భారీగా హాజరయ్యారు. రహదారులు జై జగన్, జై సుచరిత నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఎంపీ కిలారి వెంకట రోశయ్యతో కలిసి తాడికొండ షిర్డిసాయి పర్తి సాయిబాబా ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా రంగంలోకి దిగి తాడికొండ అడ్డరోడ్డులో వాహనాలను ముందుకు నడిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో కలసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న మేకతోటి సుచరిత గుంటూరు నుంచి జన ప్రవాహం అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరు కుమారుడు, కుమార్తెతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుచరిత -
పదిలో మెరిసిన బాలికలు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్లు, ఐఎఫ్పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే టెన్త్ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్కు చెందిన తమలపాకుల అభినవ్ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్గా నిలిచాడు. గుంటూరు రూరల్ యనమదల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు షేక్ రిహానా 583, షేక్ సమ్రీన్ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫాతిమా తబసుమ్ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్ మొహమ్మద్ (బీఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్ (ఎస్ఆర్ఎస్ మున్సిపల్ హైస్కూల్, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు -
రేపు బలసాని కిరణ్కుమార్ నామినేషన్
గుంటూరురూరల్: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు. నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు. ఏలూరి కో–ఆపరేటివ్ బ్యాంక్ శాఖ ప్రారంభం తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ, తెనాలి చైర్మన్ డి.ఎల్. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్, బ్యాంక్ డైరెక్టర్ దత్త వెంకట కిరణ్ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్ను ప్రారంభించినట్టు చైర్మన్ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్, చీఫ్ మేనేజరు ఎం.వి.ఆర్ శేషుకుమార్, రవిమోహన్ పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. 11వ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాస్ తెనాలిరూరల్: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కమిటీని పరిచయం చేశారు. -
ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్
గుంటూరువెస్ట్: గుంటూరు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని, రవిశంకర్ పెమ్మసాని నామినేషన్ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్ పీపుల్స్ పార్టీ), షేక్ ఖాజావలి (ఇండిపెండెంట్), మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. క్షమాపణలు చెప్పిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు. పోలీసులపై దురుసు ప్రవర్తన పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్కుమార్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement