తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి సర్వ దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
నిన్న(గురువారం) స్వామివారిని 52,894 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.