రూ.30వేలు పలికిన అరుదైన కలిచా చేప


అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం చీరాల వాడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్య్సకారులు తెలిపారు. క్యాన్సర్, మొదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయూరీలో కోల్‌కతా, ముంబాయి నగరాల్లో ఈ కలిచా చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే వాడరేవుకు చెందిన వ్యాపారి నాగేంద్ర ఈ చేపను రూ.30,000 వేలకు దక్కించుకున్నాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top