విధులు నిర్వర్తిస్తూ.. నేలకొరిగాడు! | Invigilator dies of heart attack on duty | Sakshi
Sakshi News home page

విధులు నిర్వర్తిస్తూ.. నేలకొరిగాడు!

Mar 24 2016 11:26 PM | Updated on Sep 3 2017 8:29 PM

పదోతరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా దంతాలపల్లి హైస్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది.

నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పదోతరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా దంతాలపల్లి హైస్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం ఆగపేట యూపీఎస్ ఉపాధ్యాయుడు లేగల(నెలకుర్తి) రాంరెడ్డి(52) దంతాలపల్లి ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్‌గా వెళ్లారు. పరీక్ష హాల్‌లోనే గుండెపోటుకు గురై పడిపోయూడు.

వెంటనే ఎంఈఓ కొండ్రెడ్డి సోమిరెడ్డి కారులో చికిత్స నిమిత్తం తొర్రూర్‌కు తరలిస్తుండగానే మృతిచెందారు. మృతుడికి భార్య ఉమ, కుమార్తెలు మౌనిఖ, రవళి ఉన్నారు. రాంరెడ్డి 22 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే పని చేస్తుండడంతో అందరికీ సుపరిచితులు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement