కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ : కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోర్టు కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ... గ్రామస్తులు శనివారం మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. పోర్టు కోసం తమ భూములు ఇచ్చేది లేదని... ఉన్నతాధికారులకు గ్రామస్తులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో అధికారులు... గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి... గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేశారు. శుక్రవారం బందరు మండలం పోట్లపాలెంలో ఇటువంటి పరిస్థితే నెలకొంది. మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమాన్ని సదరు గ్రామస్తులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా... ఈ కార్యక్రమంలో కూర్చిలను తగలబెట్టిన సంగతి తెలిసిందే.