మురుగు కాల్వలో నాలుగు శిశు మృతదేహాలు | four female fatus found in drinage in kurnool | Sakshi
Sakshi News home page

మురుగు కాల్వలో నాలుగు శిశు మృతదేహాలు

Feb 9 2016 9:54 AM | Updated on Sep 3 2017 5:17 PM

కర్నూలులో దారుణ సంఘటన వెలుగుచూసింది.

కర్నూలు: కర్నూలులో దారుణ సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన నలుగురు ఆడ శిశువులను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. కర్నూలులోని ఆనంద్ థియేటర్ సమీపంలోని బ్రిడ్జి పక్కనే ఉన్న మురికి కాల్వలో పారిశుద్ధ్య సిబ్బంది మంగళవారం మురుగు తీస్తుండగా.. నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు లభించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పుట్టక ముందే ఆడ పిల్లలని తెలియడంతో అబార్షన్ చేసి పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement