లారీ బోల్తా.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు | Accident In East Godavari District | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు

Apr 19 2017 8:06 AM | Updated on Sep 5 2017 9:11 AM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి

తుని(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పేటగుంట వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

జిప్సం లోడుతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ పేటగుంట వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లోడుపై కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో పాములూరి వీరేంద్ర(33) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుదని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement