వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి
తుని(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పేటగుంట వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
జిప్సం లోడుతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ పేటగుంట వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లోడుపై కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో పాములూరి వీరేంద్ర(33) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుదని భావిస్తున్నారు.