రైల్వే టీటీఈపై ఏసీ మెకానిక్‌ దాడి | AC mechanic attack railway tte | Sakshi
Sakshi News home page

రైల్వే టీటీఈపై ఏసీ మెకానిక్‌ దాడి

Aug 8 2016 12:09 AM | Updated on Sep 4 2017 8:17 AM

హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి కొచ్చీ వెళ్లే నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం ఉదయం రైల్వే టీటీఈ రాంగిరి సందీప్‌పై తుకాడియా లాల్‌ మీనా అనే ఏసీ మెకానిక్‌ దాడికి పాల్పడ్డాడు. నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బీ–2 కోచ్‌లో ఏసీ పనిచేయడం లేదని టీటీఈ సందీప్‌కు పలువురు ప్యాసిం జర్లు ఫిర్యాదు చేశారు.

కరీమాబాద్‌: హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి కొచ్చీ వెళ్లే నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం ఉదయం రైల్వే టీటీఈ రాంగిరి సందీప్‌పై తుకాడియా లాల్‌ మీనా అనే ఏసీ మెకానిక్‌ దాడికి పాల్పడ్డాడు.  నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బీ–2 కోచ్‌లో ఏసీ పనిచేయడం లేదని టీటీఈ సందీప్‌కు పలువురు ప్యాసిం జర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అదే రైలులోని ఏ–1 కోచ్‌లో ఉన్న ఏసీ మెకానిక్‌ తుకాడియాలాల్‌ మీనా వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. ఈ క్రమంలో టీటీఈ సందీప్‌పై మీనా దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement