ఓ ప్రయాణికుడు తన షూ సాక్స్లో అక్రమంగా తీసుకొచ్చిన రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్: ఓ ప్రయాణికుడు తన షూ సాక్స్లో అక్రమంగా తీసుకొచ్చిన రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథ నం ప్రకారం.. సోమవారం ఉదయం దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్లైన్స్ విమానంలోని ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడు షూ సాక్స్లో 2 కిలోల బంగారు బిస్కెట్లను దాచుకొని తీసుకొస్తుండగా, గుర్తించి స్వా ధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తిం చారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.