వీడియో: బైక్‌పై వచ్చి మొబైల్‌ స్నాచింగ్‌

Thieves Snatched Mobile Phone At Kishanbagh Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం‌లోని కిషన్‌బాగ్‌లో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఇద్దరు దుండగులు మొబైల్‌ ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఎన్‌ఎం గూడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగింది. ఒక​ వ్యక్తి మొబైల్‌ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  అతని చేతిలో నుంచి మొబైల్‌ లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరార్యాయారు. వారిని బాధితుడు వెంబడించినప్పటికీ లాభం లేపోయింది. ఈ స్నాచింగ్‌ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు గుర్తించే పనిలోపడ్డారు.
(సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top