యువతిపై సహోద్యోగి అత్యాచారం | Mumbai Teen, A Hotel Management Trainee In Jaipur | Sakshi
Sakshi News home page

యువతిపై సహోద్యోగి అత్యాచారం

Dec 5 2019 10:25 PM | Updated on Dec 5 2019 10:25 PM

Mumbai Teen, A Hotel Management Trainee In Jaipur - Sakshi

జైపూర్‌ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ 19ఏళ్ల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ నిమిత్తం కోసం జైపూర్‌కు వచ్చారు. గత వారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి  హాజరయ్యారు. ఆమె సహోద్యోగి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు. పార్టీ అనంతరం ఆమెను హోటల్‌ సమీపానికి తీసుకెళ్లిన దుండగుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జైపూర్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement