మహిళ హత్య కేసులో కీలక మలుపు | Mother Killed Daughter in Guntur | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో కీలక మలుపు

May 7 2019 1:34 PM | Updated on May 7 2019 1:34 PM

Mother Killed Daughter in Guntur - Sakshi

గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం) : ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో ఆదివారం కలకలం రేపిన మహిళ హత్య కేసులో పోలీసులు ఆమె తల్లి మంగమ్మతో పాటు ప్రియుడు శివయ్యను పలు ధపాలుగా విచారించారు. తొలుత తానే చంపానని ఒప్పుకొన్న మంగమ్మ.. ఆ తరువాత పోలీసుల విచారణలో పలు వాస్తవాలు బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉండటంతో పాటు ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకొన్న తల్లి ప్రియుడు తోకల శివయ్యతో కలసి ఆదివారం ఉదయమే హతమార్చింది.

తొలుత చిన్న రోకలి బండతో మోది ఆ తరువాత శివయ్య సాయంతో  పని కానిచ్చిట్లు పోలీసు విచారణలో బయటపెట్టింది.   ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటనను గోప్యంగా ఉంది ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా చేద్దామని అనుకొన్నారు. ఈలోపే విషయం స్థానికులకు తెలిసి పోలీసుల దాకా వెళ్లడంతో ఇద్దరు కటకటాల పాలయ్యారు. కన్న కూతురిని హతమార్చిన తల్లి  మంగమ్మ, ఆమెకు సహకరించిన శివయ్యను త్వరలో రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement